Tuesday, May 7, 2024

కరోనా వ్యాక్సీనేషన్‌ ప్రారంభం

ఎల్లారెడ్డిపేట: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సీనేషన్‌ను సోమవారం ప్రారంభించారు. 45 ఏళ్ల వయసు కలిగి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు, 60 ఏళ్లపైబడిన వయసు వారు మాత్రమే వ్యాక్సీన్‌ వేయించుకోవాలని వైద్యాధికారి ధర్మనాయక్‌ తెలిపారు. వ్యాక్సీనేషన్‌ కోసం వచ్చే వారు ఆధార్‌కార్డు, ఎన్‌సీడీ కార్డు, వైద్యుడి ప్రిస్క్రిప్షన్‌, మెడికల్‌ సర్టిఫికెట్‌ వెంట తెచ్చుకోవాలని కోరారు. వారంలో నాలుగు రోజులు సోమ, మంగళ, గురు, శుక్రవారాలు మాత్రమే వ్యాక్సీనేషన్‌ ఉంటుందని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement