Thursday, May 2, 2024

ఎస్ఈ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ధర్నా..

కరీంనగర్ విద్యుత్ ఎస్ఈ కార్యాలయం ముందు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. సాగుకు 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వాలనే డిమాండ్ తో చేపట్టిన ధర్నాకు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం రైతు ప‌క్ష‌పాతి అని చెప్పుకోవ‌డం త‌ప్పా రైతుల‌కు చేసిందేమీ లేద‌న్నారు. కాంగ్రెస్ హ‌యాంలోనే రైతులు ఆనందంగా ఉన్నార‌న్నారు. రైతుల‌కు 24 గంట‌ల ఉచిత క‌రెంట్ ఇవ్వ‌కుంటే ఊరుకునేది లేద‌ని, ఆందోళ‌న మ‌రింత ఉధృతం చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement