Monday, April 15, 2024

బుక్కెడు బువ్వ పెట్టండి.. మా ఆలనా.. పాలనా చూడండి..!!

నిజామాబాద్ నగరంలోని నర్శగౌడ్ వీధికి చెందిన న్యామ తాబాద్ గంగాజి, లక్ష్మీబాయి అనే వృద్ధ దంపతులు.. బుక్కెడు బువ్వ పెట్టి.. మా కొడుకులు మా ఆలనా.. పాలన చూసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు. సోమవారం వృద్ధ దంపతులు కలెక్టర్ కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. నాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న మడిగెల నుంచి వచ్చే అద్దె డబ్బులతోనే నా జీవనం కొనసాగుతుందని తెలిపారు. మడిగే కిరాయి కూడా ఇవ్వాలని నా కొడుకులు వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ వయసులో వంట చేసుకుని తినడానికి కూడా ఆరోగ్యం సహకరిస్తా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి కలెక్టర్ సారు స్పందించి మాకు న్యాయం చేయాలని వృద్ధ దంపతులు కలెక్టర్ ను వేడుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement