Monday, May 6, 2024

సీఎం సభకు ప్రజలు భారీగా తరలిరావాలి … ఎమ్మెల్యే దాసరి

తెలంగాణ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ ముఖ్య నాయకులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ… ఈనెల 29న సీఎం కేసీఆర్ పెద్దపల్లి జిల్లా కేంద్రానికి వస్తున్నారన్నారు. నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఇందుకోసం మండలం నుండి ప్రజలు వేలాదిగా తరలివచ్చేలా చూడాలన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి జిల్లాను ఏర్పాటు చేశారని, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని, అందుకోసం నియోజకవర్గం తరఫున బహిరంగ సభను విజయవంతం చేసి కృతజ్ఞతలు తెలియజేయాల‌న్నారు. కొత్త జిల్లా ఏర్పాటు అవడం వల్ల పరిపాలన సాలభ్యం ఏర్పడిందన్నారు. ప్రజల ముంగిటకు పరిపాలన వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో జ‌డ్పీటీసీ తిరుపతిరెడ్డి, ఎంపీపీ సంపత్ తో పాటు టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement