Thursday, May 30, 2024

సింగరేణి కార్మికుడి దారుణ హత్య

సింగరేణి కార్మికుడిని తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగానగర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లోని అర్ కే.7లో జనరల్ మజ్జుర్ గా పనిచేసే కోరకొప్పుల రాజేందర్ గోదావరిఖనిలోని గంగానగర్ లో నివాసం ఉంటున్నాడు. శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు రాజేందర్ ను తలపై దారుణంగా పొడిచి హత్యకు పాల్పడ్డారు.

మృతుడు రాజేందర్ విధులు ముగించుకొని తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై హెల్మెట్ పెట్టుకొని వచ్చినట్లు సీసీ కెమెరాలలో దృశ్యాలు రికార్డయ్యాయి. మృతుడి భార్య రవళి బాత్ రూం కోసం బయటకు వచ్చిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి తలపై గుర్తు తెలియని ఆయుధంతో పొడిచి హత్య చేశారు. సమాచారం అందుకున్న గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్, సిఐలు రమేష్ బాబు,రాజ్ కుమార్ గౌడ్ లు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement