Friday, July 26, 2024

Review – పార్టీ నేత‌ల‌తో చంద్ర‌బాబు టెలికాన్ఫ్ రెన్స్ … కౌంటింగ్ ఏర్పాట్ల‌పై స‌మీక్ష

పోలింగ్ తర్వాత విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నేడు తిరిగి హైద‌రాబాద్ కు వచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలకు ఏర్పాట్లు సాగుతున్న నేపథ్యంలో బుధ‌వారం పార్టీలోని కీలక నేతలతో ఆయ‌న టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ప్ర‌ధానంగా కౌంటింగ్ డే ప్లాన్‌పై నేతలతో ఆయన చర్చించారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో అధికార‌ వైసీపీ మాటల యుద్ధం సాగిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చంద్ర‌బాబు నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు. కౌంటింగ్‌పై సీరియస్‌గా దృష్టిపెట్టాలని నేతల్ని కోరారు.

- Advertisement -

ఇందుకోసం శుక్ర‌వారం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజక వర్గాల చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో సమావేశం కావాలని ఆయన నిర్ణయించారు. అలాగే జూన్ 1న జోనల్ స్ధాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వనున్న‌ట్లు ప్ర‌క‌టించారు.. ఈ రెండు కార్యక్రమాలు చాలా కీలకమని చంద్రబాబు భావిస్తున్నారు. అంతేగాక‌ పోస్టల్ బ్యాలెట్ విషయంలో నెలకొన్న భిన్నాభిప్రాయాలు, అంచనాల నేపథ్యంలో కౌంటింగ్‌లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నిబంధనలపై ఇప్పటికే వైసీపీ చేస్తున్న విమర్శల‌ను ఎప్పటికప్పుడు విమర్శల్ని తిప్పికొట్టాలని నేతల్ని చంద్రబాబు ఆదేశించారు.

వైసీపీ నేతలు ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారని పేర్కొన్నారు. అందుకే ఈసీ, పోలీసులపై విమర్శలు చేస్తున్నారని గుర్తు చేశారు. అటు కౌంటింగ్ రోజు పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎన్నిక‌ల సంఘాన్ని కోరాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు ఈసీ, డీజీపీకి లేఖ రాయనున్నారు. రాష్ట్రంలో 175 సీట్లకు గానూ, 130 ఎన్నికల పరిశీలకులనే నియమించడం పట్ల చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక రేపు హైద‌రాబాద్ నుంచి ఉండ‌వ‌ల్లిలోని త‌న నివాసానికి చంద్ర‌బాబు వెళ్ల‌నున్నారు..అక్క‌డి నుంచే కౌంటింగ్ ప్లాన్,పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్నారు.. కౌంటింగ్ ముగిసే వ‌ర‌కు చంద్ర‌బాబు ఉండ‌వ‌ల్లిలోనే ఉండ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement