Friday, May 3, 2024

13 మంది పేకాటరాయుళ్ల పట్టివేత… రూ.80,700 స్వాధీనం

కరీంనగర్ లోని రెండు వేరువేరు ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న 13 మందిని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. వీరి వద్ద నుండి 80,700 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలో పేకాట ఆడుతున్న 8మంది సిహెచ్ హనుమంతు, కుంచాల చిరంజీవి, గోనెపల్లి శ్రీను, నలిమెల అజయ్, బండారి వెంకటేష్, బండారి సుబ్బయ్య, వెలుగు నాగరాజు, బత్తిని శ్రీను లను పట్టుకున్నారు వీరి వద్ద నుండి 62,000 స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీరిని త్రీటౌన్ పోలీసులకు అప్పగించారు. కోతిరాంపూర్ లో పేకాట ఆడుతున్న 5గురిని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. పోరండ్లకు చెందిన కిన్నెల సతీష్, బోయిని బాపురాజు, హరిపురం కు చెందిన గోగు శ్రీనివాస్, సుభాష్ నగర్ కు చెందిన పెళ్లి సంతోష్, దేవంపల్లికి చెందిన పోలు శ్రీధర్ లు పట్టుబడ్డారు. వీరి వద్దనుండి 18,700రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement