Friday, May 17, 2024

దేవుడి సొమ్ము గోవిందా, దేవాదాయశాఖ ఫిక్సడ్‌ డిపాజిట్లు ఖాళీ.. 300 కోట్ల వరకూ ఎఫ్‌డీలు రద్దు

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో : పెనం మీద నుండి పొయ్యి లో పడినట్లుగా తయారైంది .. కొన్ని దేవాలయాల పరిస్థితి. రాష్ట్రంలోని ఆయా దేవాలయాల ఆధునీకరణకు గతంలో రూ.138 కోట్లతో ప్రతిపాదనలు తయారుచేశారు. ఆదిశగా నిర్మాణ పనులు కూడా చేపట్టారు. అయితే, ఆయా దేవాల యాల పరిధిలో అందుకు అవసరమైన నిధులు అం దు బాటులో లేకుండానే ఆధునీక రణ పనులకు పచ్చ జెండా ఊపారు. ఫలితం గా ఆ బిల్లుల చెల్లింపుకు రాష్ట్రవ్యాప్తంగా ఇతర దేవాలయాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను రద్దుచేసి ఆ సొమ్ముతో బిల్లులు చెల్లించాల్సిన పర్థితి ఏర్పడింది. అయితే, అభివృద్ధి పనులకు సంబంధించి రూ. 150 కోట్ల వరకే బిల్లులు చెల్లిం చాల్సి ఉన్నప్పటికీ దేవాదాయ ధర్మాధాయ ఉన్నతాధికారులు మాత్రం రూ. 300 కోట్లకుపైగా ఎఫ్‌డీలను రద్దుచేసి ఆసొమ్మును సీజీఎఫ్‌, ఈఏఎఫ్‌ ఖాతాల్లో వేయనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే గడచిన రెండు వారాల్లో రూ.80 కోట్లకుపైగా ఎఫ్‌డీలు పై ఖాతాలకు జమచేసినట్లు సమాచారం. గతంలో రాష్ట్రవ్యాప్తంగా పలు దేవాలయాలను ఆధునీకరించాలని గతంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆయా దేవాల యాల పరిధిలో ఆధునీకరణకు సంబంధించి అందుబాటులో ఉన్న నిధులతోనే ఆపనులు చేపట్టాల్సి ఉంది. అయితే, అందు కు పూర్తి భిన్నంగా చేతిలో సొమ్ములు లేకుండా అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఆ బిల్లుల చెల్లింపు దేవాదాయ శాఖకు భారంగా మారింది. దీంతో రాష్ట్రవ్యాప్తం గా రూ. 20 లక్షలకుపైడి ఉన్న ఎఫ్‌డీలను రద్దుచేసి ఆసొమ్ముతో కాంట్రాక్టర్లకు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమా చారం. ఈమేరకు దశలవారీగా డిపాజిట్లు రద్దుచేసి ఆసొ మ్మును పై ఖాతాలకు మళ్లిస్తున్నట్లు తెలిసింది. ఆశాఖ ఉన్న తాధికారులు తీసుకుంటున్న నిర్ణయాలపై అదేశాఖలోని కింది స్థాయి ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

డిపాజిట్లు ఖాళీ….
రాష్ట్రంలోని ఏ, బీ, సీ కేటగిరీ పరిధిలోని వేలాది దేవాల యాల పరిధిలో సుమారు రూ. 3 వేల కోట్లకుపైగా ఎఫ్‌డీలు ఉన్నాయి. ఆయా ఆలయాల పరిధిలో ప్రతి ఏటా ఉత్సవాలు, నిర్వహణ తదిరాల కోసం ఎఫ్‌డీలపై వచ్చే వడ్డీపై ఆధారపడే నిర్వహిస్తుంటారు. అయితే, ఆ శాఖ ఉన్నతాధికారులు ఆయా జిల్లాల పరిధిలోని ప్రముఖ దేవాలయాలకు సంబంధించిన ఎఫ్‌డీల నుండి సుమారు రూ. 300 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుని ఆదిశగా రద్దుచేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అనేక దేవాలయాల్లో ఎఫ్‌డీ ఖాతాలు ఖాళీ అవుతు న్నాయి. ఆయా దేవాలయాల పరిధిలోని ఉద్యోగుల్లో ఆందో ళన వ్యక్తమవుతోంది. భవిష్యత్‌లో ఆలయాల నిర్వహణకు, జీతభత్యాలకు ఇబ్బందులు ఎదురైతే పరిస్థితి ఏమిటి..అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం రద్దు చేస్తున్న ఎఫ్‌డీలను తిరిగి జమ చేస్తారా.. అనే అంశంపై కూడా స్పష్టత లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

నిధుల్లేకుండా అభివృద్ధి పనులు…
రాష్ట్రంలోని వివిధ దేవాలయాల పరిధిలో సుమారు రూ. 138 కోట్ల విలువైన అభివృద్ధి పనులను చేపట్టాలని, ఆదిశగా ప్రతిపాదనలు రూపొందించారు. అందుకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆమోదం కూడా తెలిపారు. అయితే, నిబం ధనల మేరకు ప్రతిపాదనలు సిద్ధంచేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అందుకు పూర్తి భిన్నంగా ప్రైవేటు దేవాలయాల అభివృద్ధికి కూడా దేవాదాయ శాఖ నిధులను కేటాయించారు. అంతేకాకుండా ఒక్కో అభివృద్ధి పనికి గరిష్టంగా రూ. 20 లక్షల నుండి రూ. 25 లక్షల వరకూ మాత్రమే మంజూరు చేయాల్సి ఉందని చెబుతున్నారు. దీనిని కూడా పాటించకుండా ఇష్టారాజ్యంగా కేటాయించడంతో ఇప్పుడు ఈ చిక్కులు వచ్చిపడినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. కృష్ణా జిల్లాలో అయితే ఓప్రైవేటు దేవాలయ అభివృద్ధికి ఏకంగా రూ. 60 లక్షలు కేటాయించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా గ్రామాల పరిధిలో రామాలయాలు, సత్రాల ఆధునీకరణకు రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షల వరకూ కేటాయించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆబిల్లుల చెల్లింపుకు ఎఫ్‌డీలను రద్దుచేస్తున్నట్లు తెలుస్తోంది.

కొరవడిన ముందుచూపు..
దేవాలయాల పరిధిలో వచ్చే ఆదాయంలో 55 శాతం ఖర్చులు, జీతభత్యాలకు వినియోగించాల్సి ఉంది. మిగిలిన 45 శాతం నిధులతో ఉత్సవాలు, కళ్యాణాలు ఇతర ఆధునీకరణ పనులకు వెచ్చించాల్సి ఉంది. అయితే, దేవాదాయ శాఖ పరిధిలోని కొంత మంది అధికారులకు ముందుచూపు కొరవడటంతో అందుకు పూర్తి భిన్నంగా ఆనిధులను ఇతర అవసరాలకు వినియోగించినట్లు విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. ఉన్నతాధికారుల జీతాలు, సీజీఎఫ్‌, ఈఏఎఫ్‌లకు కలిపి దేవాదాయ శాఖకు 25 శాతం నిధులను జమ చేయాలి. అలాగే, ఉద్యోగులు, అర్చకుల జీతాలు, కరెంటు బిల్లులు మరో 25 శాతం ఖర్చవుతుంది. మొత్తం ఆదాయంలో 55 శాతం పోను మిగిలిన 45 శాతం ఆలయ ఖాతాల్లో భద్రపర్చాలి. ఆసొమ్మును ఏడాదికొకసారి నిర్వహించే ఉత్సవాలు, కళ్యాణాలు, ఆలయ నిర్వహణకు వెచ్చించాలి. సరిగ్గా ఇక్కడే ఆశాఖ ఉన్నతాధికారులు నిబంధనలను తుంగలో తొక్కారు. నిర్వహణకు వెచ్చించాల్సిన 45 శాతం నిధులను ఇతర అవస రాలకు వినియోగించినట్లు తెలుస్తోంది. దీంతో గత ఏడాది చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపు ఎఫ్‌డీలను రద్దుచేసి ఆ సొమ్ముతో కాంట్రాక్టర్లకు బిల్లులను చెల్లించాల్సి వస్తోంది. కేవలం ఉన్నతాధికారుల్లో ముందు చూపు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్న విమర్శలు దేవాదాయ శాఖలోని కిందిస్థాయి ఉద్యోగుల నుండి వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement