టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, డైనమిక్ లీడర్, మంత్రి కేటీఆర్ రేపు బర్త్డే జరుపుకోనున్నారు. అయితే అనుకోని విధంగా ఆయన కాలుజారీ కిందపడడంతో పాదం (ఆంకిల్ లిగిమెంట్) బెనికింది. దీంతో నడవలేని పరిస్థితి ఏర్పడింది. కాగా, మూడు వారాలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పడంతో ఇంట్లోనే ఉండిపోయారు. ఈ మేరకు ఆయన ఈ వివరాలను తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
ఇక తనకు ఈ మూడు వారాలు ఓటీటీలో ఉన్న కంటెంట్ లో ఏది చూడాలో తెలియజేయాలని అభిమానులను కోరారు. అదే తనకు ఇప్పుడు కాస్త రిలీఫ్ ఉంటుందని తెలియజేశారు. కాగా, బర్త్ డే ముందు రోజు కాలి గాయంతో కేటీఆర్ ఇంటికే పరిమితం కావడంపై అభిమానులు, కార్యకర్తలు కాస్త నిరుత్సాహంగా ఉన్నారు.
- Advertisement -