ప్రభ న్యూస్ : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో 840 బార్లు ఏర్పాటు కానున్నాయి.ఈ-వేలం ద్వారా వీటిని వేలం వేయనున్నారు.ఈ మేరకు ఎకై-్సజ్ శాఖ నిన్న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం..ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి 31 ఆగస్టు 2025 వరకు బార్లకు అనుమతినిస్తూ లైసెన్సులు మంజూరు చేస్తారు.శుక్రవారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకు దరఖాస్తులు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి.
ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకుని ప్రాసెసింగ్ ఫీజుతోపాటు నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజును మాత్రం ఈ నెల 28వ తేదీ వరకు చెల్లించొచ్చు.దరఖాస్తులు సమర్పించేందుకు జోన్ల వారీగా తేదీలు నిర్ణయించారు. రాష్ట్రంలో అత్యధికంగా విశాఖపట్టణంలో 128 బార్లు కొత్తగా ఏర్పాటు- కానుండగా,ఆ తర్వాతి స్థానంలో విజయవాడ (110),గుంటూరు (67), నెల్లూరు (35) ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.