Saturday, April 27, 2024

అన్నదానం చాలా గొప్పది.. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా గొప్పదని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు శ్రీ సత్య సాయి నిత్యాన్న ప్రసాద సేవా పథకం ద్వారా చేపట్టిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగుల సహాయకులకు ఆపద సమయంలో ప్రతినిత్యం అన్నదానం చేయడం అభినందనీయమ‌న్నారు. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం నిరుపేదలు ప్రభుత్వాసుపత్రిలో చేరుతారని, వారి సహాయకులు పస్తులు ఉండకుండా సత్యసాయి సేవా సమితి ప్రతిరోజు అన్నదానం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement