Sunday, May 19, 2024

పిల్లలతో ఆత్మహత్యకు ప్రయత్నించిన మహిళ.. రక్షించిన పోలీసులు..

కరీంనగర్ రూరల్ మండలం దుర్షెడ్ గ్రామానికి చెందిన పోరండ్ల రమ భర్త వేధింపులు తాళలేక తన ఇద్దరు పిల్లలతో గురువారం ఆత్మహత్య ప్రయత్నం చేయగా కరీంనగర్ రూరల్ పోలీసులు రక్షించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
పోరండ్ల రమకి మహేష్ అనే వ్యక్తితో వివాహం జ‌రిగింది. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. గత కొన్ని రోజులుగా ర‌మను భర్త వేధిస్తున్నాడు. వేధింపులు తట్టుకోలేక గురువారం ఇరుకుల్ల బ్రిడ్జిపై హత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడంతో బ్రిడ్జి దగ్గరలో ఉన్న స్థానికులు చూసి దుర్షెడ్ గ్రామ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్ రావు సమాచారం అందజేశారు. వెంటనే సంపత్ రావు సీఐ విజ్ఞాన్ రావుకి తెలపడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ఆత్మహత్యకు ప్రయత్నించిన మహిళను రక్షించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్ రావు బ్లూ కోర్టు సిబ్బంది శ్రీనివాస్ కానిస్టేబుల్ , హోంగార్డ్ యాదగిరి నాయక్ . సింగిల్ విండో డైరెక్టర్ గాజుల అంజయ్యలను అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement