Monday, May 6, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన‌డం సంతోషంగా ఉంది-ఆరోహీ రావ్

ఎంపీ సంతోష్ కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మం నిర్విరామంగా కొన‌సాగుతోంది.ఇప్ప‌టికే ఈ ఛాలెంజ్ లో ఎంతో మంది సెల‌బ్రిటీలు పాల్గొన్నారు. కాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మంలో పాల్గొంది బిగ్‌ బాస్‌ పోటీదారు ఆరోహీ రావ్‌. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్‌ గారికి కృతజ్ఞతలు అని చెప్పింది.ఈ కార్యక్రమంలో భాగంగా జుబ్లీహిల్స్‌ ప్రశాసన్‌ నగర్‌లో మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..‘బిగ్‌ బాస్‌ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన వెంటనే ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. స్వచ్ఛమైన ప్రాణవాయువు లభించాలంటే ప్రకృతిని కాపాడుకోవాలి. మొక్కలు నాటడం ద్వారానే అది సాధ్యం. ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement