Tuesday, May 7, 2024

మ‌హా శివ‌రాత్రి రోజున శ్వేత నాగు ద‌ర్శ‌నం….

మంచిర్యాల : మహా శివరాత్రి పర్వదినాన మంచిర్యాల‌ జిల్లాలోని లక్సీట్టిపేట్ మున్సిపాలిటీ పరిధిలోని కోర్టు ఆవరణలో శ్వేతనాగు దర్శనం ఇచ్చింది. విష‌యం చుట్టుప్ర‌క్క‌ల తెలియ‌డంతో శ్వేత‌ నాగును చూసేందుకు పెద్దఎత్తున అక్క‌డి చేరుకున్నారు. భ‌క్తులు పాలు పోసి, కొబ్బ‌రికాయ‌లు కొట్టి పూజ‌లు చేశారు. శ్వేత‌నాగు భ‌క్తులు పోసిన పాల‌ను తాగింది.. మహా శివరాత్రి నాడు శ్వేత‌ నాగు ద‌ర్శ‌నంతో భ‌క్తులు త‌న్మ‌యత్వం చెందారు. అనంత‌రం పాములు పట్టేవారికి స‌మాచారం ఇవ్వ‌గా వ‌చ్చి శ్వేత‌ నాగును ప‌ట్టుకుని అట‌వీప్రాంతంలో వ‌దిలేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement