Monday, April 29, 2024

షర్మిల పార్టీలో చేరనున్న కాంగ్రెస్ కీలక నేత

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. గాయకుడు ఏపూరి సోమన్న కాంగ్రెస్ పార్టీకి గురువారం నాడు రాజీనామా చేశారు. ఈ నెల 15న షర్మిల పార్టీలో ఏపూరి సోమన్న చేరనున్నారు. షర్మిల పార్టీలో చేరేందుకే ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు కాంగ్రెస్ మీద నమ్మకం లేదని ఏపూరి సోమన్న చెప్పారు. పార్టీలో సీనియర్లు కూడా వారి భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నారని, తెలంగాణలో నియంత ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలని ఏపూరి సోమన్న అన్నారు. కాగా షర్మిల పార్టీకి అధికార ప్రతినిధిగా ఇందిరా శోభన్‌ వ్యవహరించనున్నారు. ఆమె కూడా ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement