Tuesday, May 21, 2024

కోతులు దాడి – యువతి మృతి…

వరంగల్ జిల్లా: బట్టుపల్లిలో కోతుల దాడి వల్ల ఓ యువతి భవనం పైనుంచి దూకి ప్రాణాలు కోల్పోయింది. వివ‌రాల‌లోకి వెళితే, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన కేంద్రంలో విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. హాస్టల్ భవనంలోకి కోతుల గుంపు ప్రవేశించడంతో విద్యార్థినులంతా కేకలు వేస్తూ పరుగులుపెట్టారు. భయంతో శిరీష అనే విద్యార్థిని కోతుల దాడి నుంచి తప్పించుకోడానికి హాస్టల్ భవనంపై నుంచి దూకింది. దీంతో ఆమె అక్కడికక్కడే మ‌ర‌ణించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement