Wednesday, May 15, 2024

16 లోపు నియోజ‌క‌వ‌ర్గ స్థాయి క‌మిటీలు ఏర్పాటు – వైఎస్ ష‌ర్మిల‌..

హైదరాబాద్: పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన వైఎస్ షర్మిల లోటస్‌పాండ్‌లో ముఖ్య అనుచరులతో నేడు సమావేశమయ్యారు. వివిధ అంశాల‌పై ఆమె చ‌ర్చించారు.. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కమిటీలే కీలకమని చెప్పారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో ముగ్గురితో కమిటీ నియామించామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు కమిటీ సభ్యుల ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. కమిటీ వ్యవహారాల బాధ్యతను పిట్టా రాంరెడ్డికి అప్పగించామని తెలిపారు. ఈ నెల 16లోపు కమిటీ సభ్యుల నియామకం పూర్తి చేస్తామని షర్మిల పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement