Tuesday, May 14, 2024

అక్కపల్లి రాజేశ్వర ఆలయంలో మంత్రి కొప్పుల ప్ర‌త్యేక పూజ‌లు..

ధర్మపురిలో మహాశివరాత్రి ఉత్సవాలు భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో కొన‌సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అక్కపల్లి రాజేశ్వర ఆలయంలో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆల‌యానికి చేరుకున్న మంత్రి దంప‌తుల‌కు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. కాగా, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయం రామలింగేశ్వరస్వామి ఆలయంలోనూ ప్రత్యేక పూజ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నేరేళ్ల సాంబశివ ఆలయానికి ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. వేకువ జాము నుంచి భక్తులు గోదావరి నదిలో స్నానాలు చేసి రామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement