KARIMNAGAR: హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం నియోజకవర్గంలోని వీణవంక మండల కేంద్రంలో పోలింగ్ సరళిని ఆయన పరిశీలించారు.
భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఐదు మండలాల్లో పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.