Friday, May 3, 2024

మడ అడవులు కబ్జా.. అధికారులను కదిలించిన ఆంధ్రప్రభ

మడ అడవులు కబ్జా అంటూ ఆంధ్రప్రభ దినపత్రికలో శుక్రవారం ప్రచురించిన కథనానికి మచిలీపట్నం జిల్లా రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది. మడ అడవుల్లో ఎవరున్నా అరెస్టు చేయాలంటూ తాసిల్దార్ కార్యాలయానికి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడంతో మండల రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రెవెన్యూ యంత్రాంగంఇంకెవరు మడ అడవులలోకి వెళ్లి అక్కడ పరిస్థితులను ఆరా తీశారు. సి ఆర్ జెడ్ పరిధిలో ఎవరు అక్రమ తవ్వకాలు కొనసాగించిన అరెస్టు చేస్తామని తాసిల్దార్ మైనర్ బాబు ఆంధ్రప్రభకు తెలిపారు. స్థానిక వీఆర్వో అప్రమత్తంగా ఉంటూ అక్కడ భూములపై ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు తాసిల్దార్ తెలిపారు.

ఇది కూడా చదవండి:

Advertisement

తాజా వార్తలు

Advertisement