Saturday, May 4, 2024

HYD: అంద‌రి స‌హ‌కారంతో ఆషాఢ బోనాలు ఘ‌నంగా నిర్వ‌హించాం… మంత్రి త‌ల‌సాని

హైద‌రాబాద్, జులై 31 (ప్ర‌భ న్యూస్) : అందరి సహకారం, కృషితో ఆషాఢ బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బోనాల ఉత్సవాలు ముగిసిన సందర్భంగా దేవాదాయశాఖ అధికారులు సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిశారు. వివిధ ఆలయాల వద్ద పటిష్టమైన ఏర్పాట్లను చేసిన కారణంగా లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సంతోషంగా దర్శనం చేసుకున్నారన్నారు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుపుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. దేవాదాయశాఖలోని అన్ని స్థాయిలలోని అధికారులు, సిబ్బంది బోనాల ఉత్సవాల నిర్వహణలో ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. మంత్రిని కలిసిన వారిలో దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ లు బాలాజీ, కృష్ణ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement