Sunday, April 28, 2024

NLG: చెత్త సేకరణకై ట్రాక్టర్ కొనుగోలు, సబ్ సెంటర్ ఏర్పాటుకు తీర్మాణం

మోత్కూర్, జూలై 31 (ప్రభ న్యూస్) : మోత్కూర్ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ తీపిరెడ్డి సావిత్రి మేఘారెడ్డి అధ్యక్షతన సోమవారం మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మోత్కూరు మున్సిపల్ కార్యాలయం సమీపంలో గతంలో ఉన్న పశువుల హాస్పిటల్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నందున, హెల్త్ సబ్ సెంటర్ ఏర్పాటుకు, మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణ నిమిత్తం మరొక ట్రాక్టర్ ట్రాలీ కొనుగోలు చేయుటకు తీర్మానించినట్లు తెలిపారు. పట్టణంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉన్నందున, వీధి కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని, పట్టణంలో సెంట్రల్ లైటింగ్ లైట్ లకు నూతన మీటర్లు ఏర్పాటు చేయాలని, స్ట్రీట్ లైట్స్ పని చేయడం లేదని తగు చర్యలు తీసుకోవాలని సభ్యుల ఆమోదంతో తీర్మానించారు.

కొండగడప, బుజిలాపురంలలో స్మశానవాటికలు మంజూరు కాగా, పనులు చేయుటకు కాంట్రాక్టర్ లు రాకపోవడంతో, స్మశాన నిర్మాణాలు పూర్తి చేయుటకు తగు చర్యలు తీసుకోవాలని చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ సి.శ్రీకాంత్, వైస్ చైర్మన్ బొల్లేపల్లి వెంకటయ్య, కౌన్సిలర్లు పురుగుల వెంకన్న, బొడ్డుపల్లి కళ్యాణ్, వనం స్వామి, కూరేళ్ల కుమారస్వామి, గుర్రం కవిత, కారుపోతుల శీరీష, ఎర్రబెల్లి మల్లమ్మ, కో ఆప్షన్ సభ్యులు గనగాని నర్సింహా, ఎండి నబీ, పి ఆనందమ్మ, షాహీన్ సుల్తానా లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement