Sunday, April 28, 2024

అన్నదానం, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ను ప్రారంభించిన ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా

హైదరాబాద్ లోని అల్వాల్ లో ఆర్యవైశ్య సంఘం-అల్వాల్ ఆధ్వర్యంలో జరిగిన 4వ అన్న ప్రసాదం (అమావాస్య అన్నదానం) కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఐవీఎఫ్ తెలంగాణ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా విచ్చేసి, 4వ అన్న ప్రసాదం (అమావాస్య) కార్యక్రమాన్ని ప్రారంభించారు. తదనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారిని శాలువతో సన్మానించారు. ఆ తర్వాత.. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా, అల్వాల్ లోని అంబేద్కర్ నగర్ సర్కిల్ లో ఈవీ ఛార్జింగ్ (ఎలక్ట్రిక్ బైక్) స్టేషన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో..అల్వాల్ 134 డివిజన్ కార్పొరేటర్ విజయశాంతి – శ్రీనివాస్ రెడ్డి, తెరాస నాయకులు గొట్టిముక్కుల శ్రీనివాస్ గౌడ్, ఐవీఎఫ్ స్టేట్ జనరల్ సెక్రటరీ పబ్బ చంద్రశేఖర్, ఉద్యమకారిని జ్యోతి గౌడ్, అల్వాల్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పాలకుర్తి నరేష్, అల్వాల్ ఆర్యవైశ్య సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎర్ర అంజయ్య, ఐవీఎఫ్‌ గీతా గుప్త, రజిని, నేలంటి శ్రీనివాస్ గుప్తా, వి.చంద్రశేఖర్, గుమ్మడవెళ్లి శ్రీనివాస్, శర్మజీ, రాంకి సార్, పొట్టి నాగేశ్వరరావు, ఎమ్.సత్యనారాయణ, చిరంజీవి, బి.చంద్రశేఖర్, మదుకర్, ఆర్యవైశ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement