Thursday, May 2, 2024

మునుగోడులో టీఆర్ఎస్ విజ‌యం ఖాయం : మంత్రి తలసాని

మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుపొంద‌డం ఖాయ‌మ‌ని మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ అన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురాని బీజేపీ నేత‌లు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కాంట్రాక్టుల కోసమే ఉప ఎన్నిక తెచ్చి రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సనత్‌నగర్ బన్సీ లాల్‌పేటలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. దుబ్బాక, హుజూరాబాద్ లో గెలిచిన బీజేపీ నాయకులు ఏం చేశార‌ని నిలదీశారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలన్నారు. రాజగోపాల్ రెడ్డి స్వార్ధంతోనే మునుగోడు ఉప ఎన్నికలు వచ్చాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి విజయం తధ్యమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement