Wednesday, May 8, 2024

బైక్ ను ఢీకొన్న టిప్ప‌ర్ : దంప‌తులు మృతి

బైక్ ను టిప్ప‌ర్ ఢీకొట్టడంతో ఇద్ద‌రు మృతిచెందిన ఘ‌ట‌న‌ హైదరాబాద్ చోటుచేసుకుంది. నగరంలోని కూకట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూకట్‌పల్లిలోని సాయిబాబానగర్‌లో బైక్‌ను టిప్పర్‌ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement