Saturday, May 4, 2024

బడికొచ్చిన చిన్నారులు రక్తం చిందించారు: చంద్రబాబు

కర్నూల్ జిల్లా గోనెగండ్ల మండల ప్రాధమికోన్నత పాఠశాలలో పైకప్పు పెచ్చులు రాలి చిన్నారుల తలలకు తీవ్ర గాయాలైన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ ఘటన బాధాకరం అని అన్నారు. నాడు-నేడు అంటూ ప్రచారం చేసుకోవడం తప్ప ఈ ప్రభుత్వం పాఠశాలల పునరుద్ధరణ కోసం ఏమీ చేయడం లేదనడానికి ఈ ఘటనే ఉదాహరణ అని పేర్కొన్నారు. తల్లిదండ్రులు హెచ్చరించినా పట్టించుకోలేదంటే ఏమనాలి ? అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత వల్ల చదువుకుందామని బడికొచ్చిన చిన్నారులు రక్తం చిందించాల్సి వచ్చింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటు అని విమర్శించారు. ప్రభుత్వం ఇకనైనా పాఠశాలల్లో మౌలిక వసతుల పట్ల శ్రద్ధ చూపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఒక ఫుల్ పేజీ ప్రకటన డబ్బులతో ఎన్నో పనులు చేయవచ్చు అని అభిప్రాయపడ్డారు. అలాగే బాధిత చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement