Saturday, April 27, 2024

Breaking: మ‌రోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు

ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల డేటాను విడుదల చేశాయి. ఈరోజు విడుదల చేసిన డేటాలో హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్ ధరపై 17 పైసలు పెరగడంతో.. లీటరు రూ.119.66కు చేరుకుంది. గురువారం ఈ ధర రూ.119.49గా ఉంది. అలాగే డీజిల్ ధర కూడా హైదరాబాద్‌లో రూ.105.49 నుంచి రూ.105.65కు ఎగిసింది. గత నెల రోజులకు పైగా స్థిరంగా ఉంటూ వచ్చిన ధరలు.. నేడు పెరిగి వాహనదారులకు షాకిచ్చాయి. మరోవైపు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారల్ 109 డాలర్లుగా నమోదైంది. డబ్ల్యూటీఐ బ్యారల్‌కు 107.4 డాలర్లకు చేరుకుంది. దీంతో దేశీయంగా ఇక రేట్ల పెంపుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. లీటరు పెట్రోల్ ధర స్థిరంగా రూ.105.41 వద్ద, లీటరు డీజిల్ ధర రూ.96.67 వద్ద ఉంది. ఇతర ప్రధాన నగరాలు చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరులలో కూడా ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ ఒక్క హైదరాబాద్‌లోనే ధరలు పెరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement