Wednesday, May 15, 2024

పాఠ‌శాల అభివృద్ధి కోసం న‌గ‌ర డిప్యూటీ మేయ‌ర్ కు విన‌తి

హైదరాబాద్ న‌గ‌రంలోని లాలాపేట్ గాడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో “మన ఊరు – మన బడి” కార్యక్రమం కింద పాఠశాల అభివృద్ధి కోసం పాఠశాల యాజమాన్యం డిప్యూటీ మేయర్ కు వినతిపత్రం అందజేశారు. శనివారం తార్నాకలోని డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయం వద్ద గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టి టి యు సి రాష్ట్ర అధ్యక్షులు మోతె శోభన్ రెడ్డి, ప్రిన్సిపాల్ శోభారాణి, టీచర్ తిరుపతిరెడ్డి, సరస్వతి, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement