Thursday, May 16, 2024

HYD : గడ్డి అన్నారం లో ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సోదరుడు రణధీర్ రెడ్డి

హైదరాబాద్ తూర్పు ప్రతినిధి, నవంబర్ 7(ప్రభ న్యూస్)
ఎల్బీనగర్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవి రెడ్డి సుధీర్ రెడ్డికి మద్దతుగా ఆయన సోదరుడు డాక్టర్ దేవి రెడ్డి రణధీర్ రెడ్డి గడ్డి అన్నారంలో ముమ్మర ప్రచారం నిర్వహించారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం నాయకుడు గండి జ్యోతి ప్రసాద్ యాదవ్ ( సన్నీ యాదవ్) ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు డివిజన్ పరిధిలోని లలితా నగర్, న్యూ గడ్డి అన్నారం కాలనీ, గౌతమ్ నగర్,పటేల్ నగర్, కృష్ణ నగర్ కాలనీ, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాలలో ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ ప్రచార కార్యక్రమానికి డాక్టర్ రణధీర్ రెడ్డి తో పాటు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ హాజరై ప్రసంగించారు.. అభివృద్ధి నిరాటకంగా కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ని గెలిపించాలని ఓటర్లను కోరారు… ఎల్బీనగర్ అభివృద్ధి సుధీర్ రెడ్డితోనే సాధ్యమని నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ అధ్యక్షుడు జక్కుల శ్రీశైలం యాదవ్, నాయకులు రమేష్ ముదిరాజ్,ప్రదీప్ గౌడ్, ఐలేష్ యాదవ్, విక్కీ,సన్నీ,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement