Sunday, April 28, 2024

KHM: వసతిగృహంలో సమస్యలు పట్టించుకోండి మహప్రభో… విద్యార్థుల ఆవేదన

మణుగూరు, నవంబర్ 7 (ప్రభ న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని సమితి సింగారం పంచాయతీ ఎస్సీ వసతి గృహంలో విద్యార్థులు సరిగా భోజనం పెట్టడం లేదని, మా సమస్యలు పట్టించుకోండి మహాప్రభో అంటూ వసతి గృహం అవరణలో ధర్నాకు దిగారు. విద్యార్థులు తెలిపిన వివరాలు ప్రకారం… గతకొంత కాలం నుండి సరైన భోజనం పెట్టడం లేదని వాపోయారు. ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారం పెట్టకుండా వారికి ఇష్టం వచ్చినట్లుగా రుచి, పచి లేని భోజనం పెడుతున్నారని అవేదన చెందారు. వసతి గృహంలోకి విష పురుగులు సంచరిస్తున్నాయని, ఇటీవల ఒక్క విద్యార్దికి తేలు కుట్టిన కూడా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు.

కనీసం రాత్రి కాపలాదారుడు కూడా లేడని, కొంత మంది బయట వారు రాత్రి సమయంలో మద్యం సేవించి వసతి గృహంలోకి వచ్చి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. ఏమైనా సమస్యలు వార్డెన్ కు చెప్పుదామన్నా, వార్డెన్ రాక చాలా రోజులు అయ్యిందని తెలిపారు. కనీసం ఫోన్ చేసిన కూడా రెస్పాండ్ కావడం లేదని తెలిపారు. వసతి గృహంలో ఎక్కడ సమస్యలు అక్కడే పేరుకుపోయాయని అన్నారు. ఇప్పటికైనా జిల్లా పరిపాలన అధికారి, సంబందిత అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement