Monday, April 29, 2024

మహేశ్వరంలో పోచమ్మ, ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్టామహోత్సవం

కుత్బుల్లాపూర్ : దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ పరిధి మహేశ్వరంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీపోచమ్మ, శ్రీముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలకు మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ముఖ్య అతిధిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, మాదాసు వెంకటేశం, తెరాస నియోజకవర్గం యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేశ్ యాదవ్, జీహెచ్ఎంసీ గాజులరామారం డివిజన్ అధ్యక్షులు విజయ్ రామ్ రెడ్డి, జగద్గిరిగుట్ట డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, రంగారెడ్డి నగర్ డివిజన్ అధ్యక్షులు ఏర్వ శంకరయ్య, సుభాష్ నగర్ డివిజన్ అధ్యక్షులు పోలె శ్రీకాంత్, నాయకులు ఎత్తరి మారయ్య, ఊట్ల శ్రీహరి, గణేష్, నారాయణ, నర్సింహా, పరమేష్, సంజీవ, నగేష్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement