Saturday, April 27, 2024

కరోనా వైరస్ తో జాగ్రత్త..

కవాడిగూడ : కరోనా వైరస్ ని‌ అరికట్టేందుకు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ముషీరాబాద్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలో ఏప్రిల్‌ 20నుంచి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రతి ఒక్కరు సహాకరించాలని ఆయన అన్నారు. సిఎం కెసిఆర్‌ కరోనా నుంచి త్వరగా కోలుకొని ప్రజలకు సేవలు అందించాలని కోరుతూ భోలక్‌పూర్‌లోని శ్రీ భవనీశంకర దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌ నివారణకు అందరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రజలంతా కరోనా వైరస్‌ బారిన పడకుండా క్షేమంగా ఉండాలని తెలిపారు. ఇది మనకోసం, మన రాష్ట్ర ప్రజల క్షేమం కోసం అంటూ అందరూ పాటించాలని అన్నారు. కరోనా తగ్గేవరకు అందరూ ఇండ్లకే పరిమితమై క వైరస్‌ నివారణకు సహాకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం లో టిఆర్‌ఎస్‌ నేతలు ముఠా జయసింహా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement