Thursday, April 25, 2024

వారం రోజుల్లో 4 ల‌క్ష‌ల రెమిడెసివిర్ వైయిల్స్….కెటిఆర్

హైద‌రాబాద్ – తెలంగాణ‌లో క‌రోనా చికిత్స కోసం వినియోగించే రెమిడిసివిర్ ఇంజెక్ష‌న్ కొర‌త తీవ్రంగా ఉన్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం దిద్దుబాటు చ‌ర్య‌లు ప్రారంభించింది… రెమిడెసివిర్ త‌యారీ సంస్థ‌ల‌తో ముఖ్య‌మంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్ నేరుగా చ‌ర్చ‌లు జ‌రిపారు… వారం రోజుల వ్య‌వ‌ధిలో మొత్తం నాలుగు ల‌క్ష‌ల రెమిడెసివిర్ వైయిల్స్ అంద‌జేస్తామ‌ని ఆ సంస్థ‌లు హామీ ఇచ్చాయి… ఈ విష‌యాన్ని కెటిఆర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు… వారం రోజుల్లో అన్ని ప్ర‌భుత్వ హాస్ప‌ట‌ల్స్ లో రెమిడెసివిర్ వైయిల్స్ అంద‌రికీ అందుబాటులో ఉంటాయ‌ని ట్విట్ చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement