Wednesday, May 8, 2024

HYD : మధుయాష్కి గెలుపు కోసం కదం తొక్కిన కమ్యూనిస్టులు..

ఎల్బీనగర్, నవంబర్ 15 (ప్రభ న్యూస్)
ఎల్బీనగర్ నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి సామిడి శేఖర్ రెడ్డి అధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధు యాష్కి గౌడ్ గెలుపు కొరకు బుధవారం హయత్ నగర్‌లోనీ రాజరాజేశ్వరి పవన్ గిరి వినాయక్ నగర్ లెక్చరర్ కాలనీ శివం హిల్స్ పలు కాలనీలలో సిపిఐ కార్యకర్తలతో కలిసి మమ్ముర ప్రచారం చేపట్టారు.

ప్రచారం మధు యాష్కి గౌడ్ ని గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేశారు. పేదలకు అండైన కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నబీఆర్ఎస్ ను ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement