Monday, April 29, 2024

KTR : ఆరు రోజుల్లో.. 25 నియోజకవర్గాల్లో సభలు, రోడ్డుషోలు

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ఇవాళ్టి నుంచి సుడిగాలి పర్యటనలు చేయ‌నున్నారు. కెటిఆర్ ఆరు రోజుల్లో 25 నియోజకవర్గాల్లో సభలు, రోడ్డుషోలలో పాల్గొననున్నారు. ప్రతి రోజూ ఐదు కార్యక్రమాలలో కెటిఆర్ పాల్గొంటారు. బుధవారం రాజన్న సిరిసిల్లలోని వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో పాల్గొననున్నారు.

వేములవాడ నియోజకవర్గం కథలాపూర్ మండల కేంద్రంలో నిర్వహించే (కథలాపూర్, మేడిపల్లి) మండలాల ప్రజాఆశీర్వాద సభలో, రుద్రంగి మండల కేంద్రంలో రోడ్ షోలో, చందుర్తి మండల కేంద్రంలో నిర్వహించే ప్రజాశీర్వాద సభలో పాల్గొంటారు. అనంతరం కోనరావుపేట మండలకేంద్రంలో రోడ్ షో, వేములవాడ పట్టణంలో నిర్వహించే వేములవాడ అర్బన్, రూరల్ మండలాల రోడ్ షోలో పాల్గొంటారు. సాయంత్రం సిరిసిల్ల నియోజకవర్గం తంగళ్లపల్లి మండల కేంద్రంలో రోడ్ షోలో పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement