Thursday, May 9, 2024

పండిన ధాన్య‌మంతా మేమే కొంటాం – రైతుల‌కు కెసిఆర్ భ‌రోసా….

ఎక్కడికక్కడే కొనేందుకు 6,408 కేంద్రాలు
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో నిర్ణయం
సత్వర ఏర్పాటుకు మంత్రి, సీఎస్‌, కలెక్టర్లకు ఆదేశాలు
రూ.20 వేలకోట్లకు సర్కారు బ్యాంకు గ్యారంటీ
రైతుకు కనీస మద్దతు ధర దక్కేలా నిబంధనలు పాటించండి
ప్రగతిభవన్‌లో ధాన్యం కొనుగోళ్ళపై సీఎం కేసీఆర్‌ సమీక్ష
ఆహారధాన్యాల నిల్వకు మరిన్ని గోడౌన్‌ల నిర్మాణాలు
52.76లక్షల ఎకరాల్లో వరిసాగు 1.38 కోట్ల మెట్రికటేన్నుల దిగుబడి

హైదరాబాద్‌, : కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో రైతుల ప్రయోజనాల దృష్ట్యా గత ఏడాదిలాగే గ్రామాల్లో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇందుకోసం 6,408 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రగతి భవన్‌లో వ్యవసాయ, మార్కెటింగ్ పౌర సరఫరాల శాఖలపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సమా వేశంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, పౌరసరఫరాల కార్పొరేషన్‌ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ నర్సింగ్‌ రావు, సెక్రటరీ భూపాల్‌ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌ రెడ్డి, పౌర సరఫరాల కమిషనర్‌ అనిల్‌ కుమార్‌, ఎఫ్‌.సి.ఐ జనరల్‌ మేనేజర్‌ అశ్వినీగుప్తా తది తరులు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా సీఎం మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుకు అవస రమైన 20,000 కోట్ల రూపాయలకు బ్యాంకు గ్యారంటీ ఇచ్చే ఏర్పాట్లను మంగళవారం సాయం త్రానికల్లా పూర్తి చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణారావును ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల తక్షణ ఏర్పాటు కోసం అన్ని జిల్లాల కలెక్టర్లతో అత్యవసర వీడి యా కాన్ఫరెన్స్‌ నిర్వహిం చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను ఆదేశిం చారు. హైదరా బాద్‌లోనే ఉండి కొనుగోలు కేంద్రాల ఏర్పాటును, ధాన్యం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డిని సీఎం ఆదేశించారు. వ్యవసాయ, మార్కె టింగ్‌, పౌరసరఫరాల శాఖలను సమన్వయం చేసుకుంటూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకొవాలని మంత్రిని, సీఎస్‌ను, అధికారులను సీఎం ఆదేశించారు. మొత్తం 6,408 కొనుగోలు కేంద్రా ల్లో 2,131 ఐకేపీ కేంద్రాలు, 3,964 పీ.ఏ.సీ. ఎస్‌. కేంద్రాలు, మిగతావి మరో 313 కేంద్రా లున్నాయని పేర్కొన్నారు.
రైతుకు కనీస మద్దతు ధర రావాల్సిందే
రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే విషయంలో కనీస మద్దతు ధర నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ముఖ్యమంత్రి కోరారు. వడ్లు ఎండబోసి తాలు లేకుండా 17శాతం తేమకు మించకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురా వాలని అన్నారు. తేమ ఎక్కువగా లేకుండా చూసుకోవాలని, కనీస మద్దతు ధర పొందేందు కు అనుసరించాల్సిన నిబంధనలను పాటిం చాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు అవస రమై న 20 కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉం చుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ యాసంగిలో 52.76 లక్షల ఎకరాల్లో వరి పంట పండిందని, దాదాపు 1 కోటి 17 లక్షల మెట్రిక్‌ టన్నుల దొడ్డు రకం ధాన్యం, 21 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్నరకం ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని సీఎం వివరిం చారు. ఆహార ధాన్యాల నిల్వల కోసం అదనపు గోదాములను నిర్మించేందుకు సెంట్రల్‌ వేర్‌ హౌ సింగ్‌ కార్పొరేషన్‌ సిద్ధంగా ఉన్నందున కార్పొ రేషన్‌కు లీజుకు ఇవ్వడానికి స్థలాలను ఎంపిక చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు.
మ‌న ప‌త్తికి అంత‌ర్జాతీయ డిమాండ్…
తెలంగాణ రాష్ట్రంలో పండే పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉన్నదని, పత్తి మంచి క్వాలిటీ ఉండటంతోపాటు ఎక్కువ దిగుబడి వచ్చి అధిక ధర లభించే అవకాశం ఉన్నందున, వచ్చే వానాకాలం 75 నుండి 80 లక్షల ఎకరాల్లో పత్తి పండించడానికి సిద్ధం కావాలని సీఎం కేసీఆర్‌ రైతులను కోరారు. ఇందుకు అవసరమైన విత్తనాల కోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు చేయాలని సీఎం వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జనార్ధన్‌ రెడ్డిని ఆదేశించారు. అలాగే, 20 నుండి 25 లక్షల ఎకరాల్లో కందిపంట సాగు కోసం చర్యలు చేపట్టాలని సూచించారు. పత్తి, కంది పంటలకు నీళ్ల తడులు పెడితే దిగుబడి ఎక్కువ వస్తుందని సీఎం తెలిపారు.
రాష్ట్రంలో ఒక్క ఎక‌రాకూడా ఎండొద్దు….
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కింద సాగవుతున్న వరిపంట ఎండిపోకుండా మరో పది రోజులపాటు పూర్తిస్థాయిలో సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు సాగునీటి శాఖ అధికారులను ఆదేశిం చారు. సూర్యాపేట జిల్లాలో కొన్నిచోట్ల కాల్వ చివరి భూములకు సరి పడా నీరు అందించాలని రైతులు కోరుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా చూడాలన్నారు. కరీంనగర్‌ లోయర్‌ మానేర్‌ డ్యామ్‌ నుంచి డీడీఎం-71 పరిధిలో ఉన్న సూర్యా పేట జిల్లాలోని కాల్వ చివరి భూములకు సరిపడా కాళేశ్వరం జలా లను అందించాలని ఇరిగేషన్‌ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ బి.శంకర్‌ను సీఎం ఫోన్లో ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement