Saturday, May 4, 2024

శంషాబాద్ లో అత్య‌వ‌స‌ర ల్యాండింగ్ అయిన ఇండిగో..

హైద‌రాబాద్ నుంచి క‌డ‌ప‌కు బ‌య‌ల్దేరిన ఇండిగో విమానం అత్య‌వ‌స‌రంగా శంషాబాద్ లో ల్యాండింగ్ అయ్యింది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానం హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు బయలుదేరింది. కడపలో వాతావరణం సరిగా లేకపోవడంతో విమానం ల్యాండింగ్‌కు ఏటీసీ అనుమతించలేదు. దీంతో కొద్దిసేపు విమానం ఆకాశంలో చక్కర్లు కొట్టిన అనంతరం పైలట్‌ విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ చేశారు. అయితే ఇండిగో విమానం అత్య‌వ‌స‌ర ల్యాండింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement