Wednesday, April 24, 2024

21న వైఎస్‌ వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టు తీర్పు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి బదలాయించాలన్న పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ నెల 21న తీర్పు వెలువరించనుంది. నేడు ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. బెంచ్ లోని మరో న్యాయమూర్తి అందుబాటులో లేని కారణంగానే తీర్పును వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ ఎంఆర్ షా ప్రకటించారు. మ‌రోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి మంజూరైన బెయిల్ ను రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను కూడా జస్టిస్ ఎంఆర్ షా ఈ నెల 21కి వాయిదా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement