Saturday, April 27, 2024

HYD: విభిన్న రుచులతో గుజరాతీ ఫుడ్ ఫెస్టివల్‌ను నిర్వహించిన గుజరాత్ టూరిజం

హైదరాబాద్ : యునెస్కో చేత క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీగా ఎంపిక చేయబడిన హైదరాబాద్‌లోని భోజన ప్రియులను ఆకట్టుకుంటూ గుజరాతీ ఫుడ్ ఫెస్టివల్‌ గుజరాత్ టూరిజం నిర్వహించింది. ఈ ఫెస్టివల్ లో ప్రామాణికమైన గుజరాతీ వంటకాలను నగర వాసులు ఆస్వాదించారు. హోటల్ మేరిగోల్డ్‌లో నిర్వహించిన ఈ ఫుడ్ ఫెస్టివల్ గుజరాత్ మహోన్నత పాక శాస్త్ర వారసత్వంలోకి అతిథులను తీసుకువెళ్లింది. అసలైన గుజరాతీ వంటకాల రుచిని అందించింది. గుజరాతీ ఆహార సంస్కృతిని ప్రతిబింబించే రీతిలో ఆకట్టుకునే ప్రదర్శనలతో హోటల్ ను అలంకరించారు.

ఫుడ్ ఫెస్టివల్ సందర్భంగా పాల్గొన్న అతిథి జాబితాలో పర్యాటక మంత్రిత్వ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కృపాకర్ పవిపాటి, శ్రీశాంతి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, ప్రిన్సిపల్ నరేంద్ర, టాట్ సెక్రటరీ శ్రీనివాస్, ఎస్ కె ఏ ఎల్ సెక్రటరీ మోనిన్ , యుఎఫ్ టి సి ఛైర్మన్ సిరాజ్ ఉన్నారు. మినీ హంద్వో, పత్రా, ఖాండ్వీ, ధోక్లా, ఖమాన్, ఫుల్‌వాడి, బటాటా వాడా, మెథినా గోటా వంటి సాంప్రదాయ గుజరాతీ స్నాక్స్‌ని అందించడంతో ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. అతిథులు కోబిజ్ నో సంభారో, సెవ్ తమేత ను షాక్, లసానియా బతక, రింగన్ నో ఓలో, వాల్, మాగ్ నీ లచ్కో దాల్, భరేలీ దుంగలి ను షాక్, గుజరాతీ కాధీ, రాజ్‌వాడీ కాధీ, భట్, ఫుల్కా రోటీ, బజ్రీ నో రోట్లో, వాఘారేలో రొట్లో, కచుంబార్, పాపడ్, మసాలా ఛష్, అథాను వంటి వంటకాలను సంతోషకరమైన సంభాషణల మధ్య. ఆస్వాదించారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ కి హైదరాబాద్ లోని ఆహార ప్రియుల నుండి అపూర్వ ప్రశంసలు లభించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement