Monday, May 6, 2024

HYD: చేతివృత్తిదారులకు అండగా ప్రభుత్వం.. సబితా ఇంద్రారెడ్డి

చేతి వృత్తిదారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా 300మంది లబ్ధిదారులకు 3 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.

ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… ఆధునికతతో ఉపాధి కోల్పోయిన కుల, చేతి వృత్తుల వారికి అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ కుటుంబాలకు లక్ష రూపాయలు అందిస్తున్నారన్నారు. సమాజంలో అందరూ సమానంగా ఎదగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, దయనంద్ గుప్తా, జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement