Saturday, April 27, 2024

పూర్తిస్థాయి కొవిడ్ దవాఖానగా గాంధీ హాస్పటల్..

సికింద్రాబాద్ : ‌సికింద్రాబాద్ లోని గాంధీ దవాఖానను రేపటి నుంచి పూర్తిస్థాయి కొవిడ్ దవాఖానగా మారుస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో శనివారం నుంచి దవాఖానలో ఓపీ సేవలను నిలిచిపోనున్నాయి. అత్యవసర సేవలను సైతం నిలిపి వేసి కేవలం కొవిడ్ బాధితులకు మాత్రమే వైద్యులు చికిత్స అందించనున్నారు.ఇప్పటికే దవాఖానలో 450కి పైగా రోగులు ఉన్నారు. గురువారం ఒక్కరోజే 150మంది చికిత్స నిమిత్తం చేరారు. గాంధీ దవాఖానకు కొవిడ్‌ రోగుల తాకిడి క్రమంగా పెరుగుతున్నది.దీంతో బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు ఇతర డిపార్టుమెంట్లను వైద్యులు ఖాళీ చేయిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement