Sunday, March 24, 2024

కరోనా పాజిటివ్ వచ్చిందని ఆత్మహత్య

కరోనా మహమ్మారి దేశంలో విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతుంది. ప్రతి రోజు వేల సంఖ్యలో కేసు నమోదు అవుతున్నాయి. అయితే గతంలో కరోనా పాజిటివ్ వచ్చిన ఎంతో మంది భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా ఇప్పుడు మరో యువకుడు కరోనా పాజిటివ్ రావటంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా పెదవేగి మండలం నడిపల్లి గ్రామానికి చెందిన షేక్ విలాయత్ గుంటూరు లో స్పిన్నింగ్ మిల్ లో పనిచేస్తూ ఉన్నాడు. కాగా నిన్న రాత్రి సొంత గ్రామమైన పెదవేగి మండలం నడిపల్లి కి వచ్చాడు.

అయితే ఈ రోజు రోజు ఉదయం ఫోన్ రావడం తో ఇంటి నుండి బయటకు వెళ్ళాడని ఎంతకీ రాకపోవడంతో పలు మార్లు ఫోన్ చేయగా తనకి పాజిటివ్ వచ్చిందని అందుకే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి ఫోన్ కట్ చేశాడు. అయితే వెంటనే తల్లిదండ్రులు ఆ ప్రాంతానికి వెళ్ళి చూడగా అప్పటికే షేక్ విలాయత్ మృతి చెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement