Wednesday, May 15, 2024

మాస్క్ లేకుండా షాపింగ్ – స్టోర్ య‌జ‌మానికి రూ.2వేలు జ‌రిమానా..

హైదరాబాద్: ఫతేనగర్‌లో మాస్క్‌ లేకుండా కస్టమర్స్‌ను షాపులోకి అనుమతించిన ఓ షాపు యజమానికి 2 వేల జరిమానా విధించారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది.. బహిరంగ ప్రదేశాలు, పని ప్రాంతాలు, ప్రజా రవాణా వాహనాల్లో, షాపింగ్, సినిమా హాల్స్ లో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మాస్క్‌ ధరించని వారిపై విపత్తు నిర్వహణ చట్టం-2005లోని 51 నుంచి 60 సెక్షన్లతో పాటు ఐపీసీ 188 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆ చట్టాల ప్రకారం రూ.1000 జరిమానాతో పాటు ఆరునెలల జైలు శిక్ష విధించే అధికారం ఉంది. ఇక షబ్‌-ఏ-బరాత్‌, ఉగాది, శ్రీరామనవమి, మహవీర్‌ జయంతి, గుడ్‌ ప్రైడే, రంజాన్‌, తదితర పండుగల వేడుకలపైనా ఆంక్ష‌లు విధించింది.. బ‌హిరంగ ప్ర‌దేశాల‌లో పండుగ వేడుక‌ను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది ప్ర‌భుత్వం.

Advertisement

తాజా వార్తలు

Advertisement