Sunday, May 5, 2024

డ్రైనేజి సమస్య పరిష్కారం కోసం..

కవాడిగూడ : ముషీరాబాద్‌ మున్పిపల్‌ డివిజన్‌లోని ఆదర్శ కాలనీలో డ్రైనేజి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ముషీరాబాద్‌ నియోకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ వాటర్‌వర్స్క్‌ అధికారులను ఆదేశించారు. బస్తీలో డ్రైనేజీ సమస్య తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇక్కడి ప్రజలు సమస్యను తన దృష్టికి తీసువచ్చారని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యే మున్సిపల్‌, వాటర్‌ వర్స్క్‌ అధికారులతో కలిసి ఆయా ప్రాంతాలలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్‌ పరిధిలోని వివిధ బస్తీలలో డ్రైనేజి సమస్యను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. పెరిగిన జనాభాకనుగుణం గా ఆయా బస్తీలలో నూతన పైప్‌లైన్‌లు వేయడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. గత కొన్ని రోజులుగా డ్రైనేజీ పొంగిపోర్లుతోందని, తాగునీటిలో కలుషిత నీటి సర ఫరా జరుగుతోందని వెల్లడించారు. బస్తీలలోని సమస్యలను ప్రజలు తమ దృష్టికి తెస్తే వాటిని వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమం లో టిఆర్‌ఎస్‌ నేతలు ముఠా జయసింహా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement