Sunday, May 19, 2024

చెరువుల సంరక్షణపై చర్చించండి..

హైదరాబాద్ :చెరువల సంరక్షణ చేపట్టాలని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు. నగరంలోని చెరువుల సంరక్షణపై చర్చించాల్సిన సమయం వచ్చిందని రాష్ట్ర సర్కార్, మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ కమిషనర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను ట్విటర్ వేదికగా కోరారు. చెరువుల పరిరక్షణ అథారిటీకి పూర్తిస్థాయిలో అధికారాలు కల్పించాలన్నారు. కబ్జా కోరల నుంచి చెరువలను రక్షిస్తామని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చాలన్నారు. ఈ సందర్భంగా చెరువలపై హైకోర్టు ఆదేశాలను గుర్తు చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement