హైదరాబాద్ : నాగోల్ లోని తన నివాసానికి వచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని తన గెలుపునకు కృషి చేయాలని భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాను కలిసి కోరారు. సానుకూలంగా స్పందించిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా కచ్చితంగా తన మద్దతు ఉంటుందని, త్వరలోనే భువనగిరి పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపునకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తట్టి అన్నారం మైసమ్మ టెంపుల్ చైర్మెన్ సుక్క శ్రీనివాస్, ఎల్బీ నగర్ డివిజన్ దళిత సంఘం అధ్యక్షులు జోగు రాములు, చిరంజీవి గౌడ్, భవాని గౌడ్, సాయి గౌడ్, మాల వెంకట స్వామి, ప్రవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంధం రాములు, కో ఆపరేటివ్ బ్యాంక్ కాలనీ ప్రెసిడెంట్ శరత్ రెడ్డి, ఐవీఎఫ్ సికింద్రాబాద్ ప్రెసిడెంట్ బల్దే రవి కుమార్ గుప్తా, ఐవీఎఫ్ స్టేట్ అడిషనల్ సెక్రెటరీ కటకం శ్రీనివాస్ గుప్తా, ప్రభాకర్ గుప్తా, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.