Monday, May 13, 2024

HYD : బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన చిత్రలేఅవుట్ కాలనీవాసులు

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం చిత్ర లేఅవుట్ కాలనీ ప్రజానీకం భారతీయ జనతా పార్టీకి జై కొట్టారు. డివిజన్ కార్పొరేటర్ రాధాధీరజ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా జాతీయ నాయకులు పేరాల శేఖర్ జీ సమక్షంలో చిత్ర లేఅవుట్ కాలనీ పెద్దలు, యువకులు, మహిళలు కాషాయం కండువాలు కప్పుకున్నారు.

మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధీరజ్ రెడ్డి, ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, ఆర్కేపురం డివిజన్ అధ్యక్షులు ముంతా రాములు సహా పలువురు బీజేపీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement