Thursday, May 16, 2024

రూ. రెండు ల‌క్ష‌ల కోట్ల బ‌డ్జెట్ – పిఆర్సీకి రూ 10వేల కోట్లు

మ‌రికొద్దిసేప‌టిలో రాష్ట్ర బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్న ఆర్ధిక శాఖ మంత్రి హ‌రీష్ రావు.
సంక్షేమ పథకాలకు భారీగా నిధులు
నీటి పారుదల, మౌలిక వసతులకు పెద్దపీట
పన్నేతర ఆదాయంపై భారీ ఆశలు
సొంత వనరుల రాబడి 10 % పెంచే ఛాన్స్
హైదరాబాద్‌, పెరిగిన ఆర్ధిక అవసరాలకు ధీటుగా రాబడిని పెంచుకునే లక్ష్యంతో అధునాతన పద్దతిలో, వాస్తవిక కోణంలో వార్షిక బడ్జెట్‌ను ప్రభుత్వం నేడు శాసన సభలో ప్రవేశ పెట్టనుంది. నేటి ఉదయం 11.30 గంటలకు శాసనసభలో ఆర్ధిక శాఖా మంత్రి 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడ్తారు. పలు ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఈ దఫా కొత్త పథకాలు, పీఆర్సీ వంటి వాటికి ప్రభుత్వం భారీగా నిధులను బడ్జెట్‌లోనే పొందుపర్చింది. నిరుద్యోగ భృతిపై ఇంకా ఎటు వంటి నిర్ణయం తీసుకోని సర్కార్‌ ఈ పథకంపై అసెంబ్లి వేదిక గానే కీలక ప్రకటన చేయనుందని, సానుకూలంగా ఉంటే బడ్జెట్‌లో పద్దు ఉండే అవకాశం కూడా లేకపోలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ పథకానికి అవసరమైన రూ. 8వేల కోట్ల కేటాయింపులపై సందిగ్ధత నెలకొంది. మొత్తంమీద గడచిన 4 మాసాలుగా పెరిగిన సొంత వనరుల వృద్ధిరేటు అంచనాలతో 10శాతం వృద్ధిరే టుతో రూ. 1.90వేల కోట్లనుంచి రూ. 2 లక్షల కోట్లలోపు బడ్జెట్‌ పద్దు ఉండనుంది. ఈ మేరకు ప్రభుత్వం వ్యయాలు, రాబడుల అంచనాలకు ప్రణాళికలు వేస్తోంది. ప్రస్తుత ఆర్ధిక యేడాది కరోనా విపత్తుతో రూ. 55వేల కోట్ల రాబడిలోటు ప్రత్యక్షంగా మరో రూ. 50వేల కోట్లు పరోక్షంగా ప్రభావం చూపింది. లోటులోనే ఉన్నప్పటికీ వచ్చే ఏడాది బడ్జెట్‌లో సంక్షేమ పథకాలన్నీ ఖచ్చితంగా అమలు చేయడమే కాదు, కొత్త పథకాలు, ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం దార్శనిక దృక్పథంతో వ్యవహరిస్తోంది. వ్యవసాయం, సంక్షేమం, వైద్యం, ఇరిగేషన్‌కు అధిక నిధులు కేటాయించి ప్రాధాన్య తనిచ్చేలా పద్దును సిద్ధం చేసింది.
గడచిన ఏడాదిగా రాష్ట్ర రాబడులు తగ్గినప్పటికీ ఇతర మార్గాల్లో సమీకరించుకున్న ఆదాయాలను ఖర్చు చేస్తోంది. తద్వారా ఈ ఏడాదిలో కరోనా విపత్తుతో నిల్చిన రాబడులు, కేంద్ర సాయంలో కోతలు, పెండింగ్‌ బకాయిలు, ఆర్దిక మాం ద్యం ప్రభావాలను సంక్షేమ పథకాలపై పడనీయకుండా ప్రభు త్వం వ్యూహరచన చేస్తోంది. ఆర్ధిక సమన్వయంలో భాగ ంగా అర్ధవంతమైన ఉపాధిని పెంచుతూ, ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు అనేక చర్యలు తీసుకోనుంది. పేదరికాన్ని తగ్గించే చర్యలు, అక్షరాస్యత పెంపు కార్యాచరణ, విద్య, వైద్యం, ఇతర సదుపాయాలను ఆధునీకరించేందుకు చర్యలను తీసు కుంటోంది. ఈఏడాది కూడా మిగులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, వ్యవసాయం, అనుబంధ రంగాలు, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడి వ్యయాల పెంపు లక్ష్యంగా భారీ మొత్తాలకు ప్రభు త్వం సిద్దమైంది. సంపద సృష్టిలో భాగంగా నీటిపా రుదల, ప్రాజెక్టులు, రవాణా, మౌలిక వసతులకు పెద్ద పీట వేయనుంది. వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు రూ. 20వేల కోట్లు, ఇరిగేషన్‌కు రూ. 22వేల కోట్లు, పీఆర్సీకి రూ. 10వేల కోట్లు, ఒకవేళ నిరుద్యోగ భృతి ప్రకటించాల్సి వస్తే ఈ పద్దుకు 20లక్షల మందికిగానూ రూ. 8వేల కోట్లు, సామాజిక పింఛన్లకు రూ. 11వేల కోట్లు, ఉద్యోగుల వేతనాలు, పింఛన్లకు రూ. 38వేల కోట్లు, రాష్ట్ర రాబడిలో కనిపిస్తున్న వృద్ధిరేటును అంచనా వేసుకుంటూ సొంత వనరులపై భారీగా పెంపును వర్తింపజేయాలని భావిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం ఆదాయం రూ. 1.18వేల కోట్లు రాగా, రూ. 1.10లక్షల కోట్లు వ్యయం చేశారు. ఇప్పటికే సుమారు. రూ. 45వేల కోట్లు రుణాలు సేకరించారు. వచ్చే ఏడాది రూ. 50వేల కోట్ల అప్పులు, భూములు, దిల్‌ ఆస్తులు, రాజీవ్‌ స్వగృహ ఇండ్ల విక్రయాలతో పన్నేతర ఆదాయంగా రూ. 30వేలకోట్లను అంచనా వేసినట్లు సమాచారం. స్థిరాస్తికి ఉన్న డిమాండ్‌ నేపథ్యంలో మార్కెట్‌ విలువలను పెంచి రిజిస్ట్రేషన్ల శాఖ అంచనాలను పెంచను న్నారు. ఆబ్కారీ లక్ష్యం కూడా భారీగా పెంచుకోనున్నారు. జీఎస్టీ రాబడి పెరుగుదల నేపథ్యంలో రూ. 50వేలకోట్లకుపైగా లక్ష్యం నిర్దేశించనున్నారు.
ప్రజల కొనుగోలు శక్తిని అంతకంతకూ పెంచడం, పెట్టుబడి వ్యయానికి నిధులు వినియోగించడమనే ద్విముఖ వ్యూహంతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌కు శ్రీకారం చుట్టింది. పన్నేతర ఆదాయంపై ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుం టున్నది. వస్తున్న ఆదాయ వనరులను జాగ్రత్తగా వినియోగిం చుకోవడం, బయటి నుంచి నిధుల సమీకరణ, పన్నులను పెంచకుండా రాబడిని ఆర్జించే వెసులుబాటులను ప్రభుత్వం పరిశీలించింది. ఇసుక రీచ్‌లతో రాబడి, ఆబ్కారీ పాలసీలో మార్పులు, భూముల వేలం, జీఎస్టీ ఎగవేతలు, బకాయిల వసూలు, కేంద్రంనుంచి రావాల్సిన బకాయిల వసూలుకు ప్రాధాన్యతనిస్తోంది.
రైతు రుణమాఫీకి రూ. 6,500కోట్లు, రైతు బంధుకు రూ. 15000కోట్లు, ఆసరా పించన్లకు రూ. 11వేల కోట్లు, డబుల్‌ బెడ్‌రూం ఇండ్లకు రూ. 30వేల కోట్లు, ఉచిత విద్యుత్‌కు రూ. 4వేల కోట్లు, ఆరోగ్య శ్రీ సేవలకు రూ. 1000 కోట్లు, సబ్సిడీ బియ్యానికి రూ. 3వేల కోట్లు కేటాయించనున్నట్లు తెలిసింది. తాజాగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో లేకపోవడంతో కొత్త పథకాలు అమలు, పాత పథకాల కొనసాగింపుతోపాటు, ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా పించన్లు రెండింతలు, వయో పరిమితి 57 ఏళ్లకు తగ్గించడంతో కొత్తగా అర్హత సాధించ నున్న పించన్‌దార్లపై అధ్యయనం మొదలైంది. భూముల వేలం, మార్కెట్‌ విలువల సవరణ, నూతన బార్లకు అనుమ తులు, ఇసుక పాలసీ, రవాణా పన్నుల వసూళ్లు, అంతరాష్ట్ర సర్వీసులపై కూడా కొంత కఠినంగా వ్యవహరించి ఆదాయం రాబట్టేలా ప్రణాళికలు చేస్తున్నారు.

స్వంత వ‌న‌రుల రాబ‌డిపై 10 శాతం పెంపు యోచ‌న‌…
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి జనవరిలో కొంత మెరుగుపడటంతో సొంత వనరుల రాబడిని 10శాతం మేర పెంచేందుకు సీఎం కేసీఆర్‌ ఆమోదముద్ర వేశారని, కొన్ని శాఖల ప్రతిపాద నలపై సుముఖంగా లేని ఆయన అప్రధాన్య అంశాలకు, పథకాలకు నిధులను తగ్గించినట్లు తెలిసింది. ఇక రాబడి పెంచుకునే చర్యల్లో భాగంగా వచ్చే ఆర్ధిక ఏడాదినుంచి గ్రామాలు, పట్టణాల్లో ప్రాపర్టీ టాక్స్‌ పెంపు, భూము విలువల సహేతుకతతోపాటు, విద్యుత్‌ చార్జీల పెంపు వంటివి బడ్జెట్‌ ప్రతుల్లో ప్రస్పుటం అవనప్పటికీ రాబడి అంచనాల పెంపుతో స్పష్టమవుతుందని ఆర్ధిక శాఖ వర్గాలు చెప్పాయి. విద్యుత్‌ చార్జీలు, మోటార్‌ వాహనాల రిజిస్ట్రేషన్లు, మార్కెట్‌ విలువల పెంపు, ఆస్థి పన్ను పెంపువంటి అంశాలతో సుమారుగా రూ. 10వేల కోట్లు, భూముల విక్రయాల రూపంలో రూ. 31 వేల కోట్లు నిర్ధేశించుకున్నెట్లు తెలిసింది. వీటిపై సీఎం కేసీఆర్‌ సమీక్షా సమావేశాల్లో మార్గనిర్దేశం చేసి ప్రజలకు ఇబ్బందులులేని విధానాల దిశగా సూచనలు చేయనున్నారు. కీలక దశలో ఉన్న ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పూర్తికి నిధుల కేటాయింపులకు రూ. 50వేల కోట్లు అవసరమని ఇరిగేషన్‌ శాఖ ప్రతిపాదనలు అందించగా బ్యాంకులనుంచి రుణాలతో కలుపుకుని రూ. 40వేల కోట్లకే పరిమితం చేసే యోచనలో సీఎం కేసీఆర్‌ అధికారులకు సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. రూ. 22వేల కోట్లు బడ్జెట్‌లో, మరో రూ. 20వేల కోట్లు కార్పొరేషన్ల ద్వారా రుణ సమీకరణకు సూచించినట్లు సమాచారం.

ప్ర‌ధాన ప‌థ‌కాల‌కు నిధులు ఇలా..
2021-22లో రైతు రుణమాఫీకి రూ. 6225కోట్లు, ఆసరా పించన్లకు రూ. 11758కోట్లు, రైతుబంధుకు రూ. 14వేలకోట్లు, రైతు బీమాకు రూ. 1241కోట్లు, గొర్రెల పంపిణీకి రూ. 3వేల కోట్లు, సాగునీటిరంగానికి రూ.22054కోట్లు, ఎస్సీ ప్రత్యేక ప్రగతికి రూ. 16వేల కోట్లు, ఎస్టీ ప్రగతినిధికి రూ. 10వేల కోట్లు, ఎంబీసి కార్పొరేషన్‌కు రూ. 500కోట్లు, మహిళా సంఘాల వడ్డీలేని రుణాలకు రూ. 1200కోట్లు, పంచాయతీరాజ్‌ శాఖకు రూ.23వేల కోట్లు, పట్టణాలకు నెలకు రూ. 1508కోట్లు, మున్సిపల్‌ శాఖకు రూ.14వేల కోట్లు, మూసీ ప్రక్షాళనకు గతేడాది కేటాయింపులు రూ. 10వేలకోట్లు ఏడాదికి మళ్లింపులు చేయనున్నారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌కు రూ . 3వేలకోట్లు, పాఠశాల విద్యకు రూ. 10వేల కోట్లు, ఉన్నత విద్యకు రూ. 1500కోట్లు, ఎమ్మెల్యే నియోజకవర్గ నిధులు రూ. 480కోట్లు కేటాయింపులు ఉండే అవకాశాలున్నాయి.‌

Advertisement

తాజా వార్తలు

Advertisement