Sunday, May 5, 2024

క‌జిన్ పై అత్యాచారం.. ఆపై బ్లాక్ మెయిల్..

హైద‌రాబాద్ – వ‌రుస‌కు సోదరి అయిన యువతిపై అత్యాచారం చేయడమే కాకుండా వీడియో చిత్రీకరించి డబ్బులు డిమాండ్‌ చేస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న వ్య‌క్తిని బంజారాహిల్స్‌ పోలీస్ లు అరెస్ట్ చేవారు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్‌లోని మహాత్మాగాందీనగర్‌లో నివసించే బాధిత యువతి(22) ఎయిర్‌హోస్టెస్‌గా శిక్షణ పొందుతుంది. తన తల్లి సోదరి కొడుకు నిఖిల్ హైదరాబాద్‌కు వచ్చి మహాత్మాగాందీనగర్‌లో అద్దెకుంటూ టైలర్‌గా పని చేస్తున్నాడు. అవసరం నిమిత్తం బాధిత యువతి నిఖిల్‌కు రూ.50 వేలు అప్పుగా ఇచ్చింది.ఈ నెల 2వ తేదీన ఆ డబ్బు ఇస్తానని బాధితురాలిని నిఖిల్‌ తన గదికి పిలిచి కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి ఆమెకు తాగించి మత్తులో నిద్రలోకి జారిన ఆమెపై అత్యాచారం చేసి వాటిని ఫోన్‌లో చిత్రీకరించాడు. ఈ నెల 4వ తేదీన బాధితురాలు తన డబ్బు ఏమైందని నిఖిల్‌ను నిలదీసింది. ఆ డబ్బు ఇచ్చేందుకు అతడు నిరాకరించాడు. అంతేకాదు తాను రెండో తేదీన అత్యాచారం చేశానని ఎవరికైనా చెబితే ఈ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరించాడు. దీంతో షాక్‌గురై బాధితురాలు వెంట‌నే పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని ఐపీసీ సెక్షన్‌ 376, 506ల కింద కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement