Saturday, May 4, 2024

NZB : బొమ్మ తుపాకీతో పోకిరీల హల్చల్.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వైద్య పరీక్షల కోసం గర్భిణీ, భర్త ఖలీల్ వాడిలో ఓ ఆసుపత్రికి వెళుతుండగా.. పోకిరీలు బొమ్మ తుపాకీతో వారిని భయభ్రాంతులకు గురిచేసిన సంఘటన కలకలం రేపింది. బుధవారం ఖలీల్ వాడిలో వైద్య పరీక్షల కోసం గర్భిణీ, భర్త ద్విచక్ర వాహనంపై ఆసుపత్రికి వెళుతుండగా.. వెనక నుండి ముగ్గురు పోకిరీలు .. బొమ్మ తుపాకీతో బెదిరించడమే కాకుండా… వికృత చేష్టలు చేసి భయభ్రాంతులకు గురిచేశారు.

దీంతో ఆ దంపతులు ఆందోళనకు గురయ్యారు. నిత్యం రద్దీగా ఉండే ఖలీల్ వాడి ప్రాంతంలో ఈ సంఘటన జరగడంతో ఒక్కసారిగా.. స్థానిక ప్రజలు ఉలిక్కిపడ్డారు. వెంటనే సంఘటన స్థలానికి ఒకటో టౌన్ పోలీసులు చేరుకొని పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ నగరంలో రోజురోజుకు పోకిరీలు రెచ్చిపోతున్నారని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోకిరీలపై పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement